Friday, May 10, 2024
- Advertisement -

విజ‌యం కోసం గోపీచంద్ ‘పంతం’

- Advertisement -

ప్ర‌తినాయ‌కుడి నుంచి హీరోగా మ‌లుపు తీసుకున్న గోపీచంద్‌కు దాదాపు ఐదారేళ్ల నుంచి స‌మ‌యం క‌లిసి రావ‌డం లేదు. అత‌డి టైం ఏమంత బాగాలేదు. అతడు ఇటీవ‌ల నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా విడుదల కాకుండా పోయింది. ఇక ఎన్నో ఆశ‌లు పెట్టుకొని థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ‘ఆక్సిజన్’ సినిమా భారీ డిజాస్టర్‌గా మిగిలి వెళ్లిపోయింది. ఈ సినిమా బాగానే ఉన్నా గంప‌గుత్త‌గా వ‌చ్చిన సినిమాల‌లో ప‌డి ఇది వెళ్లిపోయింది. ఏం ప్ర‌చార కార్య‌క్ర‌మాలు లేకుండా అలా వ‌చ్చి క‌నిపించింది. అంతే.

ఇక ఈసారి గ‌ట్టిగా విజ‌యం కొట్టాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ఈసారి కొత్త దర్శకుడు చక్రికి అవకాశం ఇచ్చాడు. ఇటీవల ఈ సినిమా ఇటీవ‌ల ప్రారంభ‌మైంది. తాజాగా ఈ సినిమాకు ‘పంతం’ అనే టైటిల్‌ను పరిసీలిస్తున్నారని సమాచారం. అయితే టైటిల్స్ విష‌యంలో మాత్రం గోపీ క‌చ్చితంగా ఒక‌టే ట్రెండ్ పాటిస్తున్నాడు. ‘సౌఖ్యం’, ‘లౌక్యం’, ‘సాహసం’, ‘శౌర్యం’, ‘య‌జ్ఞం’ వంటి సినిమా టైటిల్స్ బాగున్నాయి. ఆ సినిమాలు హిట్ట‌య్యాయి. త‌న సినిమాల పేర్ల విష‌యంలో సంప్ర‌దాయం పాటిస్తూ వ‌స్తున్నాడు.

ఇదే క్రమంలో తన కొత్త సినిమాకు కూడా సెంటిమెంట్ రీత్యా ‘పంతం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. కథపరంగా కూడా ఈ టైటిల్ యాప్ట్ అని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన హీరోయిన్‌గా మెహ్రీన్ కనిపిస్తోంది. మెహ్రీన్ ఇటీవ‌ల ల‌క్కీగ‌ర్ల్‌గా పేరు తెచ్చుకుంది. వ‌రుస‌బెట్టి సినిమాలు చేస్తోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -