Thursday, April 25, 2024
- Advertisement -

కాలినడకన వెంకన్న సన్నిధికి హీరో నితిన్!

- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇటీవ‌ల ఓ ఇంటివాడు అయిన సంగ‌తి తెలిసిందే. నిజానికి లాస్ట్ ఇయ‌ర్ ఏప్రిల్‌లోనే పెళ్లి జ‌ర‌గాల్సి ఉండ‌గా.. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా మూడు నెల‌ల ఆల‌స్యంగా పెళ్లి చేసుకున్నాడు. క‌రోనా నేప‌థ్యంలో అతికొద్ది మంది స‌మ‌క్షంలోనే నితిన్ పెళ్లి జ‌రిగిపోయింది. అలసటను కూడా లెక్కచేయకుండా ఆయన వడివడిగా మెట్లెక్కుతూ కెమెరా కంటికి చిక్కారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది.

కాగా, నితిన్ ను శ్రీవారి మెట్ల మార్గంలో చూసిన ఇతర భక్తులు ఆయనను తమ కెమెరాల్లో బంధించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం నితిన్ ‘రంగ్ దే’ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 

ఇక నితిన్ దంపతులిద్దరూ బుధవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరుపతి వెళ్లారు. నితిన్ లాంటి హీరో కాలినడకన కొండెక్కడంతో అక్కడనున్న వారంతా షాక్‌కు గురయ్యారు. మొత్తం 2గంటల 20 నిమిషాల్లో నితిన్ తిరుమల మెట్లెక్కి స్వామివారిని దర్శించుకున్నాడట. ఆ సమయంలో అభిమానులు నితిన్ తో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు.

క్రేజీ దర్శకుడికి కాజల్ నో చెప్పిందా?

విజయ్ ‘మాస్టర్’ మూవీకి కేంద్రం దిమ్మతిరిగే షాక్?

ఎన్టీఆర్ షూ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

పవన్‌ కొత్త మూవీ.. రానా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -