Thursday, April 25, 2024
- Advertisement -

తనపై వస్తున్న వార్తలపై నటుడు తనీష్ ఏమన్నాడంటే!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన తనిష్ తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోగా నటించాడు. మరికొన్ని చిత్రాల్లో విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటించాడు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. తాజాగా తనీష్ శనివారం ఉదయం నుంచి మీడియాలో తనిష్ కి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. తనీష్‌కు డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చారు. గతంలో తనీష్ ఈ డ్రగ్స్ కేసులో ఒకసారి ఎంక్వైరీకి వెళ్లి వచ్చాడు. అయితే మళ్లీ ఆయనకి నోటీసులు రావడంతో మరోసారి డ్రగ్స్ తో సంబంధాలు అంటూ వార్తలు వచ్చాయి.

తాజాగా తనకు నోటీసులు వచ్చిన మాట వాస్తవమే కానీ.. ఏ విషయంలో ఆ నోటీసులు వచ్చాయో తెలియకుండా మీడియాలో వార్తలు రావడంపై నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకండి అంటూ.. తనీష్ అఫీషియల్‌గా ఓ వీడియోని విడుదల చేశారు. ఈ విషయంపై నిజానిజాలేమిటో తెలుసుకునేందుకు క‌నీసం న‌న్ను సంప్ర‌దించ‌లేదు. నాకు వచ్చిన నోటీసుకు అర్థం ‘ఫలానా వివ‌రం మీకు తెలుసా.. తెలిస్తే చెప్పండి!’ అని మాత్ర‌మే అడిగేందుకు ఆ నోటీస్ ఇచ్చారు. నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యాన‌ని నోటీస్ పంప‌లేదు.

ఇది తెలుసుకోకుండా కొన్ని మీడియాలు ఇష్టానుసారం క‌థ‌నాలు అల్లేశాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ద‌య‌చేసి ఇలాంటి అస‌త్య ప్ర‌చారాలు చేయవద్దు. బెంగ‌ళూరు ఓ నిర్మాత నాతో సినిమా చేస్తానంటూ గ‌తంలో ఆయన నన్ను సంప్ర‌దించిన మాట నిజం.. కానీ ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. రెండేళ్లుగా ఆయ‌న‌తో ఎలాంటి కాంటాక్టులోనూ లేను. కాకపోతే ఏదైనా ఆఫర్ వస్తే ఎవరికైనా ఉత్సాహం ఉంటుంది.. ఆ ఆఫర్ కోసం ఎదురు చూస్తుంటాం. అవ‌కాశాల కోసం ఎంద‌రినో క‌లుస్తుంటాం. కానీ ఆయ‌న‌తో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. ద‌య‌చేసి అస‌త్యాలు ప్ర‌చారం చేయవద్దని వేడుకుంటున్నాను.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -