- Advertisement -
రెండు నెలల నుంచీ క్షణం కూడా తీరిక లేకుండా “నాన్నకు ప్రేమతో” సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ సుకుమార్ దర్సకత్వం లో ఈ సినిమా త్వరగా పూర్తి చెయ్యాలనే ఆలోచన చేస్తున్నాడు.
ఎక్కువ భాగం షూటింగ్ అంతా లండన్ లో ఉండగా రాకుల్ ప్రీత్ ఈ సినిమా కి హీరోయిన్ గా నటిస్తోంది. లండన్ షెడ్యూల్ ఇక రేపటి తో పూర్తి అవ్వబోతోంది అని మనకి సినిమా సభ్యులు ఇస్తున్న విశ్వసనీయ సమాచారం. కాబట్టి తదుపరి షెడ్యూల్ స్పెయిన్ లో ఉంటుంది.
ఈ సమయం లో ఎన్టీఆర్ కాస్త గ్యాప్ తీసుకోవాలని, చిన్న బ్రేక్ కోసం ఇండియా వస్తున్నాడు అని తెలుస్తోంది. తన తదుపరి చిత్రం విశేషాలు కూడా ఎన్టీఆర్ ఈ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉంది. కొరటాల శివ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎన్టీఆర్ తరవాతి సినిమా ఉండచ్చు అంటున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది.