విజయ్ దేవరకొండ ,రష్మీక హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం గీతా గోవిందం.ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బన్నీవాసు అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించారు.తాజాగా ఈ సినిమా కథ నాది అంటు ఓ ప్రముఖ దర్శకుడు ముందుకొచ్చాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే…….తాజాగా హైదరాబాద్ లో సంతోషం అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి వివిధ కేటగిరీలలో అవార్డులు అందించారు.
అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ఎస్.జానకి, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతు ‘గీత గోవిందం’ సినిమా తన పెళ్లి సందడి సినిమాకు కాపీ అని అన్నారు. నేను, అరవింద్ కలిసి ‘పెళ్లి సందడి’ సినిమా తీశాం. రీసెంట్ గా విడుదలైన ‘గీత గోవిందం’ సినిమా ఆ సినిమాను గుర్తు చేసింది. దర్శకుడు పరశురామ్ నా సినిమాను కాపీ కొట్టాడు అంటు సరాదగా మాట్లాడారు దర్శకుడు రాఘవేంద్రరావు.