Wednesday, May 8, 2024
- Advertisement -

ద‌ర్శ‌కుడు క్రిష్‌కు ఘోర అవ‌మానం…!

- Advertisement -

ద‌ర్శ‌కుడు క్రిష్ ఇటు తెలుగుతో పాటు,అటు బాలీవుడ్‌లో కూడా సినిమాల‌ను తెర‌కెక్కిస్తాడ‌ని అంద‌రికి తెలిసిందే.కెరీర్ మొద‌టి నుంచి విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుని మ‌రి సినిమాల‌ను తెర‌కెక్కిస్తు త‌న‌కంటూ మంచి స్థానాన్ని ఏర్ప‌రుచుకున్నాడు.ప్ర‌స్తుతం ఆయ‌న రెండు సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.బాల‌కృష్ణ హీరోగా తెర‌కెక్కుతున్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌కు క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.ఇక బాలీవుడ్‌లో కంగనా లీడ్ రోల్‌లో న‌టిస్తున్న మ‌ణిక‌ర్ణిక సినిమాకు కూడా క్రిషే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ చాలా వ‌ర‌కు పూర్తి అయింది.

అయితే కంగ‌నా వ్య‌వ‌హారంతో సినిమా నుంచి చాలామంది బ‌య‌టికి వ‌చ్చారు.తాజాగా ఈ సినిమా ద‌ర్శ‌కుడికి ఇవ్వాల్సిన క్రెడిట్ కూడా క్రిష్‌కు ఇవ్వ‌ద‌ట కంగ‌నా.టీజర్ విడుదలయ్యే సమయంలో దర్శకుడిగా క్రిష్ కి క్రెడిట్ దక్కదని ఆ స్థానంలో తన పేరు వేసుకుంటుందని కంగనాని టార్గెట్ చేశారు. కానీ టీజర్ లో మాత్రం దర్శకుడిగా క్రిష్ పేరే వేశారు. కానీ ఇప్పుడు వెండితెరపై కనిపించే సినిమాలో మాత్రం దర్శకుడిగా క్రిష్ పేరు ఉండదని అంటున్నారు. డైరెక్టర్ దగ్గర కంగనా తన పేరుని వేసుకొని క్రిష్ ని అవమానించడానికి సిద్ధమవుతోందని ఇన్సైడ్ టాక్. మ‌రి దీనిపై క్రిష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -