సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి తన నోటికి పని చెప్పాడు.నటుడు ,జనసేన అధినేత పవన్ కల్యాణ్పై షాకింగ్ కామెంట్స్ చేశాడు కత్తి మహేశ్.పూర్తి వివరాల్లోకి వెళ్తే…కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాదిగ జేఏసీ ఆదివారం నిర్వహించిన మాదిగ రాజకీయ చైతన్య సభకు మహేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎవరు డబ్బులిస్తే వారివైపు మాట్లాడడం పవన్ కల్యాణ్ కు అలవాటు అని ఆయన వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎవరితో జతకడతాడో తెలియదని, తన స్వార్థం కోసమే రాజకీయాల్లోకి వచ్చాడని విమర్శించారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 500 మంది ఓటర్లను కూడా పవన్ కల్యాణ్ ప్రభావితం చేయలేరని మహేష్ కత్తి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను చిత్తూరు పార్లమెంటు సీటుకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. వైసీపీ లేదా కాంగ్రెస్ ఎవరు టికెట్ ఇస్తే ఆ పార్టీలో చేరి పోటీ చేస్తానని చెప్పారు.మాదిగలను పట్టించుకునే వారికే ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు కత్తి మహేశ్.