బిగ్బాస్ రెండో సీజన్లో విన్నర్గా నిలిచాడు కౌశల్. ఆ సమయంలో కౌశల్కు ఓ స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ ఉంది. కౌశల్ బిగ్బాస్ విన్నర్గా నిలవడంలో ఆయన పేరిట ఏర్పడిన ఆర్మీ ప్రముఖ పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కౌశల్ ఆర్మీలో లుకలుకలు బయటపడ్డాయి. ఆర్మీ ఫౌండర్స్ ఆర్మీ నుంచి బయటికి వచ్చి కౌశల్పై ఆరోపణలు చేస్తున్నారు. కౌశల్కు డబ్బు పిచ్చి ఎక్కవ అని , ఎక్కడికి వచ్చిన డబ్బు అడుగుతుంటాడని వారు ఆరోపిస్తున్నారు.అభిమానులు డబ్బులతో కౌశల్ ఎంజాయ్ చేశాడని , బిగ్బాస్లో గెలిచిన డబ్బులను క్యాన్సర్ బాధితులకు వాడతానని చెప్పి , ఇప్పుడు మాట మార్చరని వారు అంటున్నారు. ఈ వ్యవహారంతో కౌశల్ పై సోషల్ మీడియాలో నెగెటివిటీ ఎక్కువైంది.
దీంతో అతనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్లో అన్ని వివరాలు జెన్యూన్ గా ఉన్నాయని, ప్రతీ ఒక్క రూపాయికి లెక్క ఉందని.. కావాలంటే ఎవరైనా ఆడిటింగ్ చేసుకోవచ్చని తెలిపారు. తనపై ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటని కౌశల్ వారిని ప్రశ్నిస్తున్నాడు. ఓ మీడియా చానెల్ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. తాను ఎంతో కష్టపడి ఈ స్థానానికి చేరుకున్నానని , కాని కావాలనే నన్ను చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. తన ఫ్యామిలీని కూడా వదిలేసి ఆర్మీ కోసం కష్టపడ్డనని కౌశల్ తెలిపాడు.మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
- Advertisement -
కౌశల్ ఆర్మీ గొడవ ముదురుతోందిగా..!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -