Saturday, May 4, 2024
- Advertisement -

ఆ హీరోని కీర్తి ఓకే చేస్తుందా?

- Advertisement -

హీరోయిన్ కీర్తి సురేష్ కెరీర్ మంచి జోష్‌లో ఉంది.మ‌హ‌న‌టి సినిమాలో కీర్తి న‌ట‌న‌కుగాను విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందిన సంగ‌తి తెలిసిందే.మ‌హ‌న‌టి సినిమా త‌రువాత వ‌ర‌స సినిమాలు చేస్తు బిజీగా ఉంది కీర్తీ . ప్ర‌స్తుతం కీర్తీసురేశ్ విజయ్‌కు జంటగా సర్కార్, విశాల్‌తో సండైక్కోళి 2, విక్రమ్‌ సరసన సామి స్క్వేర్‌ చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉంది.తాజాగా కీర్తి మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

కోలీవుడ్ వివాస్ప‌ద హీరో శింబు ప‌క్క‌న హీరోయిన్‌గా కీర్తి న‌టించ‌నుంద‌ని తెలుస్తుంది.వెంకట్‌ప్రభు ద‌ర్శ‌క‌త్వంలో శింబు ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తిని తీసుకున్నారు.వెంకట్‌ప్రభు సినిమాల‌లో హీరోయిన్స్‌కు ప్రాధ‌న్య‌త ఉంటుంది.దీంతో కీర్తి ఈ సినిమాను అంగీక‌రించినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.మ‌రి ఈ వివాస్ప‌ద హీరోతో కీర్తి సురేష్ ఓకే అంటుందా అన్నది వేచి చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన అధికార పూర్వక పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -