హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగులో నేను శైలజాతో ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా హిట్ కావడంతో వెంటనే నానితో నేను లోకల్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.రెండు వరస హిట్ల పడటంతో తెలుగులో కీర్తికి తీరుగు లేదని చాలామంది భావించారు.కాని ఇప్పడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. పవన్ కల్యాణ్తో కలిసి అజ్ఞాతవాత సినిమాను తెలుగులో మొదటి ప్లాప్ అందుకుంది కీర్తి సురేష్ .కాని వెను వెంటనే మహనటి వంటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.ఈ సినిమాతో కీర్తి సురేష్కు తెలుగులో వరస ఆఫర్లు వస్తాయని అనుకున్నారు.కాని మహనటి సినిమా తరువాత కీర్తి ఇప్పటి వరకు తెలుగులో మరో సినిమా చేయలేదు.
అవకాశాలు రావడం లేదో ,లేక వచ్చిన చేయడం లేదో తెలియదు కాని ఆమె తెలుగులో మాత్రం నటించడం లేదు.అదే సమయంలో కీర్తి తమిళంతో మాత్రం వరుస సినిమాలు చేస్తు బిజీ హీరోయిన్గా మారింది.విక్రమ్,విశాల్,శింబు,విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలు చేస్తుంది కీర్తి.కీర్తి సురేష్ తెలుగులో సినిమాలు చేయడకపోవడానికి ప్రధాన కారణం గ్లామర్ షోనే అని తెలుస్తుంది.తెలుగు సినిమాలలో హీరోయిన్స్ స్క్రీన్ ప్రజెంట్ చేయాలి.ఇక ఇప్పుడు తెలుగు సినిమాలలో లిప్ లాక్లు కామన్గా మారాయి. కీర్తి సురేష్ మొదటి నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుంది.దీని వల్లే కీర్తికి తెలుగులో అవకాశాలు రావడం లేదని తెలుస్తుంది.