Sunday, April 28, 2024
- Advertisement -

రసవత్తరంగా మారిన “మా” ఎన్నికలు.. బరిలోకి ఓ. కళ్యాణ్?

- Advertisement -

ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో మా ఎన్నికల వేడి రాజుకుంది. మా అధ్యక్ష పదవి సొంతం చేసుకోవడానికి ఇప్పటికే పలువురు బరిలోకి దిగారు. తాజాగా ఈ ఎన్నికల బరిలోకి పోటీ చేయడానికి మరొక అభ్యర్థి రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే మా ఎన్నికల బరిలో నటుడు ప్రకాష్ రాజ్, విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ,సీవీఎల్‌ నరసింహారావు ఉండగా తాజాగా ఎన్నికల బరిలోకి ఓ. కళ్యాణ్ పోటీకి దిగనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సిద్ధం చేసి, తన ప్యానెల్ సభ్యుల వివరాలను వెల్లడించారు. ఇందులో భాగంగా బండ్ల గణేష్, సుడిగాలి సుదీర్, బ్రహ్మాజీ, యాంకర్ అనసూయ వంటి వాళ్లు ఉన్నారు. అదే విధంగా మెగా బ్రదర్ నాగబాబు సైతం ప్రకాష్ రాజ్ కి మద్దతుగా నిలబడ్డారు. దీంతో మెగా కుటుంబం ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా సీనియర్ హీరో మోహన్ బాబు తనయుడు విష్ణు కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Also read:కర్మ అంటూ కత్తి మహేష్ యాక్సిడెంట్ పై పూనమ్ కౌంటర్లు?

మా సంస్థలో పనిచేసే కార్మికులు ఎదుర్కొనే ఇబ్బందులు తనకు తెలుసని, వారికి ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా చేస్తానని ఈ సందర్భంగా విష్ణు వివరించారు. ఇక బరిలో ఉన్నటువంటి జీవితా రాజశేఖర్ కి నందమూరి బాలకృష్ణ సపోర్ట్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే హేమకి ఎవరి మద్దతు ఉందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా వృత్తిపరంగా లాయర్ అయినటువంటి నరసింహారావు మా ఎన్నికల బరిలో దిగారు. ఇక తాజాగా ఓ. కళ్యాణ్ పేరు వినబడుతోంది. వెయ్యి మందికిలోపు ఉన్న మా సభ్యుల ఎన్నికలు సెప్టెంబర్ నెలలో జరుగనున్నాయి. ఈ క్రమంలోనే ఎంతమంది ఈ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ముందుకు వస్తారు? ఎవరెవరి పేర్లు తెరపైకి వస్తాయో అనే విషయం గురించి ఇండస్ట్రీలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.

Also read:సరికొత్త పాత్రలో సాయి పల్లవి స్పెషల్ వీడియో..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -