ప్రిన్స్ మహేష్బాబు సినీ కెరీర్లో టక్కరి దొంగ తర్వాత అతి బిగ్గెస్ట్ ప్లాప్ సినిమా అంటె స్సైడర్ సినిమానే. మురగన్దాస్ డైరెక్సన్లో వచ్చిన ఈ సినిమాపై ఇటు మహేష్లోను…అటు అభిమానుల్లోను భారీ అంచనాలే ఉండేవి. తీరా సినిమా విడుదల అయిన తర్వా చూస్తె అట్టర ప్లాప్ మూటగట్టుకుంది. అందుకె తరువాత చేసె సినిమాల ఎంపిక విషయంలో మహేష్ జాగ్రత్త వహిస్తున్నారు.
ప్రస్తుతం మహేశ్ బాబు 24వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చాలా వరకూ పూర్తయింది. ఈ సినిమా షూటింగ్ కొనసాగుతూ ఉండగానే .. జనవరిలో తన 25వ సినిమాను ప్రారంభించాలని మహేశ్ భావించాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఆ దిశగానే సన్నాహాలు చేస్తున్నాడు.
అయితే ‘స్పైడర్’ ఎఫెక్ట్ కారణంగా ‘భరత్ అనే నేను’ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టిన మహేశ్ బాబు .. తన 25వ సినిమాపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టిన్నట్టుగా సమాచారం. ఈ కారణంగానే హడావిడిగా ఈ సినిమాను మొదలుపెట్టకుండా, ‘భరత్ అను నేను’ విడుదలైన తరువాతనే 25వ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నట్టు చెబుతున్నారు.