Friday, April 26, 2024
- Advertisement -

అనిల్​ రావిపూడి -మహేశ్​ – గీతా ఆర్ట్స్​ కాంబినేషన్​ ఫిక్స్​ అయిందా?

- Advertisement -

భారీ బడ్జెట్​ సినిమాలు తీయడం.. అవి కూడా విజయవంతంగా తెరకెక్కించడంలో గీతా ఆర్ట్స్​ ఎప్పుడూ ముందుంటుంది. ఇదిలా ఉంటే గీతా ఆర్ట్స్​ బ్యానర్​లో త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్టు రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సూపర్​స్టార్​ మహేశ్​ బాబు, అనిల్​ రావిపూడి కాంబినేషన్​లో ఓ భారీ బడ్జెట్​ మూవీ తెరకెక్కబోతున్నదట. ఇప్పటికే వీరి కాంబోలో సరిలేరు నీకెవ్వరు విడుదలై సూపర్​ సక్సెస్​ అయింది. ఆ సినిమా టైంలోనే మహేశ్​ మరో సినిమా తీస్తానని అనిల్​కు మాటిచ్చాడట. ఇప్పుడు అది కుదరబోతున్నది.

మహేశ్​ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రలో నటిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్ లో జరిగింది. ఆ తర్వాత కరోనా వ్యాప్తి చెందడంతో ఈ సినిమా షూటింగు నిలిపివేశారు. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది.

Also Read: మరోసారి రాపో డబుల్​ రోల్​.. వర్కవుట్ అవుతుందా?

సర్కారు వారి పాట సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. దీని తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ మహేష్ చేయనున్నాడు. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తి అయిన తరువాత మహేష్ బాబుతో సినిమా ఉంటుంది. త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలు పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.

Also Read: హీరో సిద్ధార్థ్​ చనిపోయాడు.. యూట్యూబ్​ చానల్​లో వీడియో? రచ్చ రచ్చ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -