తెలుగులో ఈ సంవత్సరం పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా సత్తా చాటుతున్నాయి.ఏ సినిమా బాగున్నా దానిని ప్రశంసిస్తుంటారు సూపర్ స్టార్ మహేశ్ బాబు.తాజాగా విజయ్ దేవరకొండ,రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన గీతా గోవిందం సినిమా నిన్న(శుక్రవారం) విడుదలై సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది.తాజాగా సూపర్స్టార్ మహేష్ బాబు ఈ మూవీపై స్పందిస్తూ.. ‘ గీత గోవిందం గెలిచింది. సినిమా చూస్తూ ఎంజాయ్ చేశాను.
విజయ్ దేవరకొండ, రష్మిక చాలా బాగా నటించారు. సుబ్బరాజు, వెన్నెల కిషోర్లకు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిత్ర బృందానికి కంగ్రాట్స్’ అంటూ ట్వీట్ చేశారు. అంతకముందు మహేశ్ బాబు …అడవి శేష్ నటించిన గూఢచారి మూవీపై కూడా ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే రాజమౌళి, చిరంజీవి లాంటి ప్రముఖులు సినిమా యూనిట్ను మెచ్చుకున్నారు. ఇక ఈ సినిమా మొదటి రోజే 6 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.