Friday, May 17, 2024
- Advertisement -

ఫిలింనగర్‌ దైవసన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు

- Advertisement -

ఫిలింనగర్‌ దైవసన్నిధానం చైర్మన్‌గా సినీనటుడు మోహన్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. కాగా కంచి పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆలయ పాలకమండలి 12 మంది సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు దర్శకుడు రాఘవేంద్రరావు, చాముండేశ్వరీ నాథ్‌, సుబ్బిరామిరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ ” నేను ఎప్పుడు దేవుడి గుడికి చైర్మన్‌గా ఉండాలని కోరుకోలేదు..కానీ ఆరునెలలుగా ఈ విషయంపై సుబ్బిరామిరెడ్డి పట్టుపట్టడంతో..భక్తులకోసం బాధ్యతలు స్వీకరించా”నని అన్నారు.

చిరంజీవి తాను చిలుకా గోరింకల్లాగా గొడవపడుతుంటానని, కృష్ణంరాజుతో సరదాగా ఉంటానని తెలిపారు. కాగా దైవసన్నిధానంలో ధర్మానికి విరుద్ధంగా ఏ పనిచేయబోనని ప్రమాణం చేశారు. ఆలయంలో బ్రాహ్మణుల మధ్య గొడవలు రాకూడదని మోహన్‌బాబు సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -