పూరిజగన్నాథ్ తనయుడిని ఆకాష్ హీరోగా పెట్టి తీసిన సినిమా ‘మెహబూబా.ఈ సినిమా ఈ రోజు(శుక్రవారం) సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది.సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 11న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.ఇక ఈ సినిమా ఇండో-పాక్ సరిహద్దుల్లో తెరకెక్కింది.ఈ సినిమాను పూరి తన సొంత నిర్మాణ సంస్థలో తీశాడు. సహా నిర్మాతాగా హీరోయిన్ ఛార్మీ వ్యవహరించింది.
అయితే ఈ సినిమా మొత్తన్ని నిర్మాత దిల్ రాజు తీసుకుని రీలిజ్ చేస్తున్నారు.నటి ఛార్మీ.. తనకు చాలా హ్యాపీగా ఉందంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. తమ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుందని, సెన్సార్ సభ్యులందరికీ ఈ సినిమా బాగా నచ్చిందని చెప్పింది. ఆకాశ్ చాలా బాగున్నాడని, లవ్ స్టోరీ చాలా బాగుందని సెన్సార్ సభ్యులు తమతో పదే పదే చెప్పడం తమకు చాలా ఎనర్జీనిచ్చిందని తెలిపింది.