Tuesday, May 14, 2024
- Advertisement -

మెహ‌బూబా ట్రైల‌ర్ … మ‌మ్మ‌ల్ని చంపేస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ పుడ‌తాం..

- Advertisement -

సల్మాన్ ఖాన్ జిందాబాద్.. షారుఖ్ ఖాన్ జిందాబాద్.. అమీర్ ఖాన్ జిందాబాద్.. అబ్దుల్ కలాం జిందాబాద్, సోల్జ‌ర్ జిందాబాద్‌, మేరీ మెహబూబా జిందాబాద్ అంటూ తన ప్రేయసిపై ఉన్న ప్రేమను పాకిస్థాన్‌ సైనికుల మందు రొమ్ము విరుచుకుని మరీ చెప్తున్నాడు ఇండియన్ సోల్జర్ ఆకాశ్ పూరీ. మ‌మ్మ‌ల్ని చంపేస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ పుడ‌తాం అంటూ ‘మెహబూబా’ ట్రైల‌ర్‌తో ముందుకొచ్చారు తండ్రీ, కొడుకులు పూరిజ‌గ‌న్నాథ్‌, ఆకాశ్‌పూరీ.

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆకాశ్ పూరీ, నేహా శెట్టి ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన చిత్రం మెహ‌బూబా. 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధం నేప‌థ్యంలో ఈ మూవీ రూపొందింది. ఇప్ప‌టికే చిత్ర షూటింగ్ పూర్తి కాగా ప్రమోషన్స్‌లో భాగంగా ఏప్రిల్ 9న (ఈరోజు) సాయంత్రం ‘మెహబూబా’ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కు .. టీజర్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ ట్రైలర్ ద్వారా పూరీ సింపుల్ గా కథ చెప్పేశాడు. ఇది ఒక సైనికుడి ప్రేమకథగా, యుద్ధం .. ప్రేమకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.”దేశాన్ని ప్రేమించే మనసు కేవలం ఒక్క సైనికుడికే ఉంటుంది .. ఆ మనసులో చిన్న స్థానం దొరికినా చాలు”. “అసలు ఈ సరిహద్దులనేవి లేకుంటే ఎంత బాగుండేది”. “మమ్మల్ని చంపేస్తే మళ్లీ పుడతాం .. మళ్లీ మళ్లీ పుడతాం” అంటూ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకునేలా వున్నాయి. సందీప్ చౌతా ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా మే 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -