Saturday, May 18, 2024
- Advertisement -

కాపుల ఉద్యమం మీద సినిమా

- Advertisement -

ప్రస్తుతం ఏపీ లో కాపుల గురించీ వారి రిజర్వేషన్ ల గురించీ కాపుల ఉద్యమం గురించీ పెద్ద చర్చ నడుస్తోంది. కాపుల రిజర్వేషన్ అంశం మీద నిప్పు రాజుకుంటున్న నేపధ్యంలో ఈ ఉద్యమాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు సినిమా జనాలు కూడా. రాం గోపాల్ వర్మ లాంటి నాయకులే ఇలాంటి సినిమాల మీద విపరీతమైన ఆసక్తి తో ఉంటారు.

ప్రస్తుతం కాపు నేత వంగవీటి రాధా – రంగా ల మీద సినిమా తీస్తున్న రామూ బిజీ గా ఉన్నాడు. ఏపీ నాయుడు అనే మరొక వ్యక్తి కాపుల ఉద్యమం మీద ప్రజా గర్జన అనే పేరుతో ఒక సినిమా తీస్తున్నట్టు ప్రకటించాడు. ఏపీ జనాభాలో దాదాపు ముప్పై శాతం ఉన్న కాపులని ప్రభుత్వం ఎలా అణగదొక్కాలని చూస్తోంది ? ఎలాంటి ఇబ్బందులతో కాపులని రెచ్చగోడుతోంది అనే విషయం ఈ సినిమాలో చూడచ్చు అంటున్నారు నాయుడు. ప్రాధమిక హక్కుల కోసం పోరాడే తత్వం తమలో ఉంది అనీ , ఇప్పటికే ‘జయహో ముద్రగడ’ పేరుతో ఒక పాట కూడా తామే ఒదిలాం అనీ చెబుతున్నాడు ఆయన. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -