Sunday, April 28, 2024
- Advertisement -

అలియాభట్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ కి ముంబాయి కోర్టు నోటీసులు!

- Advertisement -

 బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ పైన కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పై ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. అలియా భ‌ట్‌తో సంజ‌య్ లీలా భ‌న్సాలీ గంగూబాయ్ క‌థైవాడి అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న విష‌యం తెలిసిందే. మేడ‌మ్ ఆఫ్ కామ‌తిపురం గా పేరొందిన గంగుబాయ్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా పై గంగూబాయి కుమారుడు బాబూజీ రాజీ షా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కారు.

ఈ మూవీలో అలియా భ‌ట్ సెక్స్ వ‌ర్క‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. దీనికి సంబంధించిన ట్రైల‌ర్ ఆ మ‌ధ్య‌న విడుద‌ల కాగా.. అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ముంబై కోర్టు భన్సాలీ, అలియా మరియు ఇద్దరు రచయితలకు సమన్లు ​​జారీ చేసింది. ఈ చిత్ర బృందం తోపాటు అలాగే బాబూజీ రాజీ షా మే 21 న కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ ట్రైల‌ర్‌లోని కొన్ని స‌న్నివేశాలు క‌థైవాడ్ ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా ఉన్నాయంటూ గంగూబాయ్ ద‌త్త‌త కుమారుడిగా చెప్పుకునే బాబు రాజీవ్ షా.. అలియా భ‌ట్, సంజ‌య్ లీలా భ‌న్సాలీ, ఇద్ద‌రు ర‌చ‌యిత‌ల‌కు స‌మ‌న్లు జారీ చేశారు.

ఈ సినిమాను హాస‌న్ జైదీ ర‌చించిన మాఫీనా క్వీన్స్ ఆఫ్ ముంబ‌యి పుస్త‌కం ఆధారంగా తెర‌కెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇక భన్సాలీ, జయంతిలాల్ గడా పెన్ ఇండియా లిమిటెడ్ కలిసి నిర్మిస్తున్న ‘గంగూబాయ్ కతియావాడి’ జూలై 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు వివాదం రేగడంతో సినిమా విడుదల పై ఉత్కంఠ నెలకొంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -