అత్తారిటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ కి అత్తా పాత్రలో నటించి అందరిని అకట్టుకుంది సీనియర్ నటి నదియా. ఈ చిత్రం తర్వాత వరస అవకాశాలతో దూసుకెళ్తుంది. అయితే ఇప్పుడు నదియా డైరెక్టర్ కం నటుడు అయిన ఎస్ జే సూర్య తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. టాప్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఎస్ జే సూర్య విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ చిత్రంలో విలన్ కి జోడిగా ఓ పాత్ర ఉందట. అందుకోసం సీనియర్ నటి నదియా ని తీసుకున్నారట. ఇక నదియా రోల్ ఈ చిత్రంలో కీలకంగా ఉంటుందట. అలాగే ఎస్ జే సూర్య తో నదియా కు రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయట.
హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది నదియా. ఆ తర్వాత పెళ్లి చేసుకొని కొంత కాలం సినిమాలకు దూరమైన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస హిట్ చిత్రాలతో ముందుకెళ్తుంది.
Related