అల్లు అర్జున్ తాజా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా మే 4న ప్రేక్షకులకు ముందుకు వస్తుంది. సినిమా హిట్పై నమ్మకంతో ఉన్నాడు బన్నీ. తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు బన్నీ. కొరటాల శివతో సినిమా ఉంటుందని భావించిన కొరటాల ప్రభాస్తో మూవీ ప్లాన్లో ఉన్నాడు.వరుసగా కమర్షియల్ ఎంటర్టైనర్లు చేస్తూ వస్తున్న అల్లు అర్జున్ తన నెక్ట్స్ సినిమా కాస్త డిఫరెంట్గా చేసే ఆలోచనలో ఉన్నాడట. లింగుస్వామితో సినిమా ఉన్నప్పటీకి తనను పక్కన పెట్టి మరి మరో దర్శకుడిని తెరపైకి తెచ్చాడు బన్నీ.
ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట బన్నీ. మొదట ఈ సినిమా కథను హీరో నానికి చెప్పాడు విక్రమ్.ఇద్దరు కలిసి సినిమా చెద్దాం అనుకున్న దశలో కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ కావడంతో విక్రమ్ సినిమాను హోల్డ్లో పెట్టాడు నాని. ఇక చేసేది ఏమి లేక ఈ కథను బన్నీకి వినిపించడం..బన్నీకి ఈ స్టోరీ నచ్చడం జరిగింది. దీంతో ఈ సినిమాను పట్టాలు ఎక్కించడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థలో గీతా ఆర్ట్స్లో చేయలని చేస్తున్నారు.