Friday, March 29, 2024
- Advertisement -

ఇక చాలు ఆపండి.. మీడియాను కోరుతున్న నాని

- Advertisement -

మీడియా.. సోషల్ మీడియాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న పేరు శ్రీరెడ్డి. ఆమె తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తోంది. క్యాస్టింగ్‌ కౌచింగ్‌పై విమ‌ర్శ‌లు చేస్తోంది. దీంతో సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆందోళ‌న మొద‌లైంది. ఏకంగా పెద్ద పెద్ద న‌టులు, ద‌ర్శ‌కులు ఆ పనికి రమ్మన్నార‌ని చెబుతూ సోష్‌ల్ మీడియా, మీడియాలో శ్రీరెడ్డి ట్రెండింగ్‌గా ఉంది.

నిస్సిగ్గుగా చెబుతుండ‌డంతో టీవీలు చూడాలంటే, యూట్యూబ్ ఓపెన్ చేయాలంటేనే భ‌య‌మేస్తోంది. ఇక ఆమెతో చ‌ర్చ‌ల కోసం ఇత‌ర న‌టిల‌తో మీడియా చేస్తున్న చ‌ర్చ‌లు ఇంకా జుగుప్స‌క‌రంగా సాగుతున్నాయి. టీవీ అంటే కుటుంబం మొత్తం క‌లిసి చూసేది. ఆ స‌మ‌యంలో ఇలాంటి ప్ర‌సారాలు రావ‌డంతో ఇబ్బందులకు గుర‌వుతారు. ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా టీఆర్‌పీ రేటింగ్‌ల కోసం పాకులాడుతూ ఎలాంటి మ్యూట్‌.. బీప్ అని చేయ‌కుండా అలాగే ప్ర‌సారం చేస్తున్నారు. దీనిపై ప్ర‌జ‌లు, వీక్ష‌కులు అంద‌రూ ఆందోళ‌న చెందుతున్నారు.

అయితే ఈ విష‌యంపై సినీ న‌టుడు న్యాచుర‌ల్ స్టార్ నాని ఆందోళ‌న వ్య‌క్తం చేశాడు. మీడియాపై మండిప‌డుతూ త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశాడు. ‘టీవీ ఛానల్స్.. వాటి వ్యాఖ్యాతలు.. కొన్ని యూట్యూబ్ ఛానల్స్.. కొంతకాలగా సినిమా ఇండస్ట్రీనే టార్గెట్ చేస్తుండడాన్ని ఖండిస్తున్నాయి. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మన మీడియా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. చిన్న పిల్లలు చూస్తున్నారు.. చాలు.. ఇక ఆపండి’ అంటూ మీడియా వ‌ర్గానికి నాని ట్వీట్ట‌ర్ ద్వారా కోరాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -