మాజీ ప్రధాని దేవేగౌడ మనువడు నిఖిల్ గౌడను హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘జాగ్వార్’. 75 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మహాదేవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒకే సారి ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా ఆడియో వేడుక ఈ నెల 18న హైదరాబాద్లో జరిగింది.
ఈ నేపధ్యంలో ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో జగపతి, రమ్యకృష్ణ లాంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఐటమ్ సాంగ్లో తమన్నా కనిపించనుంది. ఇప్పటికే దసరా బరిలో చాలా సినిమాలు రెడీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను కూడా అప్పుడే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… భాషాభేదాలతో సంబంధం లేకుండా ప్రతిభను ప్రోత్సహించడంలో తెలుగు ప్రజలు ముందుంటారన్నారు. జాగ్వార్ ట్రైలర్ చూస్తుంటే నిఖిల్ పడిన కష్టం కనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ సినిమాని అక్టోబర్ 6న రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
{youtube}v=EaA7aIw1dkI{/youtube}
Related