ప్రముఖ రేడియాలజిస్ట్, నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు శుక్రవారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో భాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ కన్నుమూశారు. నెలరోజుల క్రితం అనారోగ్యంతో కిమ్స్లో చేరారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతిచెందినట్లు కిమ్స్ వైద్యులు వెల్లడించారు.
కాకర్ల సుబ్బారావు స్వస్థలం కృష్ణా జిల్లా పెదముత్తేవి. 1925 జనవరి 25న కాకర్ల సుబ్బారావు జన్మించారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి వైద్య శాస్త్రంలో పట్టా పొందారు. హైదరాబాద్ నిమ్స్ డైరెక్టర్గా సేవలందించారు.
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా నిమ్స్ను తీర్చిదిద్దారు. పద్మావతి మహిళా వైద్యకళాశాల ఛైర్మన్గా, ఉస్మానియా ఆస్పత్రిలో రేడియాలజిస్టుగా సేవలందించారు. 2000వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.అప్పట్లో నటుడు బాలయ్య కి పిచ్చి ఉంది అని మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చింది ఈ డాక్టరే.
జడ్జి రామకృష్ణపై దేశద్రోహం కేసు.. పీలేరులో అరెస్ట్..
లోటస్పాండ్లో రెండో రోజు దీక్ష కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల..!