టాలీవుడ్ హీరోయిన్ కానీ బాలీవుడ్ హీరోయిన్ గానీ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో నటించాల్సి ఒస్తే ఒక్క క్షణం అయినా ఆగుతారా ? అసలు ఎంత పారితోషికం ఇచ్చినా పర్లేదు నేను నటిస్తా అంటూ ఎగిరి గంతేస్తారు కానీ పరినీతి చోప్రా మాత్రం మహేష్ – మురగదాస్ ల సినిమాకి నో చెప్పింది. ఇప్పుడు ఆమె స్థానం లో రకుల్ ప్రీతి వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి చాలా పేర్లు వచ్చినా గానే మొదట అడిగింది మాత్రం పరిణీత నే అంటున్నారు. పరిణితీ ఈ ప్రాజెక్టు చేయకపోవడానికి భారీగా డిమాండ్ చేయడమే కారణమని రకరకాల వార్తలు షికార్లు చేసాయి. వీటిపై తాజాగా స్పందించింది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. మహేష్ తో నటించే అవకాశం తాను కావాలని వదులుకోలేదని అధికమొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదని చెప్పింది.
అసలు ముందుగా తనను సంప్రదించినా కూడా.. కేవలం కాల్షీట్లు సెట్ కాకపోవడంతోనే మరో ఆప్షన్ లేక వదులుకున్నానని అంతే తప్ప ముందుగా వచ్చిన రూమర్స్ అన్నీ అవాస్తవాలని క్లారిటీ ఇచ్చింది.
Related