టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్పై తీవ్ర పోరాటం చేసిన శ్రీరెడ్డి తరువాత పవన్ ,వాళ్ల అమ్మగారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలైంది.ఆ టైమ్లో పవన్ హడావిడి మాములుగా చేయలేదు.ఫిలిం చాంబర్కు వచ్చి తనకు న్యాయం చేయకపోతే ఇక్కడే దీక్ష చేస్తానని చెప్పి హల్ చల్ చేశారు.పవన్కు తోడుగా మెగా హీరోలు కూడా ఫిలిం చాంబర్కు రావడంతో ఈ గొడవ ఎక్కడికి వెళ్తుందో అని అందరు భయపడ్డారు.
కాని రెండు రోజుల తరువాత అటు పవన్ కాని ,ఇటు మెగా ఫ్యామిలీ కాని ఎక్కడ ఈ విషయంపై మాట్లాడలేదు.ఈ ఇష్యూపై చానెళ్లు కూడా సైలెంట్ అయ్యాయి.ఆ సమయంలో పవన్ కూడా కొన్ని మీడియా చానెళ్ల మీద విమర్శలు చేశారు.తరువాత ఈ గొడవపై ఎవరు నోరు మెదపలేదు.విషయం ఏమిటంటే….మీడియాతో పెట్టుకుంటే ఎలా రాజ్యలే కులాయి.ఈ సంగతి పవన్కు పెద్దగా తెలియక మీడియాను బ్యాన్ చేయలని పిలుపునిచ్చారని కొందరు అభిప్రాయపడుతున్నారు.అయితే పవన్ తరుపున ఓ టాలీవుడ్ పెద్ద మీడియాతో మాట్లాడి ఈ గొడవని సెటిల్ చేశారని తెలుస్తుంది. మీ జోలికి మేము రాము, మా జోలికి మీరు రాకండి అని ఆ టాలీవుడ్ పెద్ద మీడియాతో సెటిల్మెంట్ చేశారని వినికిడి.
అందుకే పవన్ రాజకీయ సభలను కూడా సదరు చానెళ్లు లైవ్ కవరేజ్ చేస్తున్నారని సమాచారం.ఈ సెటిల్మెంట్లో భాగంగానే శ్రీరెడ్డిని ఎవరు ఛానెల్కు పిలిచి చర్చలు పెట్టకూడదని,ఆమె ఏం మాట్లాడిని టివిలో ప్లే చేయయకూడదని ఒప్పందం కుదుర్చుకున్నారని,అందుకే శ్రీరెడ్డి విషయంలో అంత హడవిడి చేసిన పవన్ ఇప్పుడు సైలెంట్ అయ్యారని తెలుస్తుంది.