- Advertisement -
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ తెలుగులో తొలి వెబ్సిరీస్ను నిర్మించింది. ‘పిట్టకథలు’ అనే టైటిల్తో ఈ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. తాజాగా దానికి సంబంధించిన ట్రైలర్ను సోషల్మీడియా ద్వారా విడుదల చేసింది. నాలుగు భాగాలుగా రూపొందిన ఈ సిరీస్కు తరుణ్ భాస్కర్, నందినీ రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి సంయుక్తంగా దర్శకత్వం వహించారు.
నలుగురు ధైర్యవంతులైన మహిళల నేపథ్యంతో ఈ సిరీస్ రూపొందింది. ఈషా రెబ్బా, లక్ష్మీ మంచు, అమలా పాల్, శ్రుతి హాసన్ కీలకపాత్రలు చేయగా.. అషిమా నర్వాల్, జగపతి బాబు, సత్యదేవ్, శాన్వీ మేఘన, సాజిత్ హెగ్డేతో పాటు తదితరులు ఈ సిరీస్లో అలరించనున్నారు. ఫిబ్రవరి 19న ఈ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తెలంగాణాలో థియేటర్ లు మళ్ళీ ఎందుకు మూత పడుతున్నాయి?