Sunday, April 28, 2024
- Advertisement -

డైరెక్టర్ గా మారబోతున్న కెమెరామెన్ విద్యాసాగర్…!

- Advertisement -

సాధారణంగా ఇండస్ట్రీలో సినిమాలకు పని చేసే కెమెరామెన్ లు డైరెక్టర్ లుగా మారడం అనేది కొత్తేమి కాదు అందరికి తెలిసిన విషయమే. ఈ తరుణంలో ఇప్పటికే శివ, గుహన్ వంటి కెమెరామెన్ లు డైరెక్టర్లుగా మారి రాణిస్తున్నారు. ఇప్పుడు వీరి మాదిరిగానే ఓ టాలీవుడ్ యంగ్ సినిమాటోగ్రాఫర్ త్వరలో దర్శకుడిగా మారబోతున్నాడు.అతనెవరో కాదు విద్యా సాగర్. విశ్వక్ సేన్ హీరోగా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కబోతుంది.ఈ చిత్రానికి విద్యాసాగర్ దర్శకత్వం వహించబోతున్నాడు.

ఇక విద్యాసాగర్ గురించి చెప్పాలంటే హైదరాబాద్ లోని ఫిల్మ్ మేకింగ్ లో ఇతను శిక్షణ తీసుకున్నాడు. తరువాత విశ్వక్ సేన్ డైరెక్ట్ చేసిన ‘ఫలక్ నుమా దాస్’ సినిమాకు విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ అందించాడు. ‘అంగమలి డైరీస్’సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన… ఈ చిత్రానికి విద్యాసాగర్ తనదైన స్టైల్ లో పనితనం చూపించి ఆకట్టుకున్నాడు.ఆ తర్వాత ‘రాజావారు రాణిగారు ‘ ..శ్రీహరి కొడుకు హీరోగా నటించిన ‘రాజ్ దూత్’ చిత్రాలకు కూడా విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ అందించాడు.

ఇతనికి మంచి టాలెంట్ ఉందని తెలుస్తుంది. అందుకే విశ్వక్ సేన్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం దక్కినట్టు తెలుస్తుంది.ఇక పోతే ఈ సినిమా విషయానికి వస్తే ఇది ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. రితిక నాయక్ అనే ఢిల్లీ బ్యూటీ ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.ఇక పూర్తి వివరాలు తొందర్లో వెల్లడవబోతున్నాయి.

వర్మకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సెన్సార్‌ బోర్డు!

40 ఏళ్ల వయసులో సునామీ ఇన్నింగ్స్, చూస్తారా!

నన్ను టార్గెట్ చేస్తున్నారు.. వాళ్లను పట్టుకోండి లేదంటే మౌనదీక్షకు దిగుతాను!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -