Thursday, April 25, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్న పూజా హెగ్డే.. ఏ విషయంలో అంటే?

- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని తెలుగు ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడుగా కొనసాగుతున్నాడు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” తో గ్రాండ్ సక్సెస్ అందుకొని మరోసారి పవనిజం స్టామినా ఏంటో నిరూపించాడు. ఈ సినిమా తర్వాత పవన్ వరుస సినిమాలతో బిజీ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, ఆ తర్వాత మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్‌ సినిమాలతో పవన్ కళ్యాణ్ మంచి జోష్ మీద ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ట్రెండ్ సెట్టర్ గా ఎంతో మంచి ఫాలోయింగ్ ఉంది.తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్నట్లు చెప్పుకొచ్చింది.అది సోషల్‌మీడియాలోనో లేక మరో విషయంలోనో కాదు మామిడి పళ్ల విషయంలో అదేంటి అనుకుంటున్నారా… ఈ సీజన్లో పవన్ కళ్యాణ్ తన ఫాంహౌస్లో పండే మామిడి పళ్ళను బుట్టలో పెట్టి తన మిత్రులకు, బంధువులకు పంపిస్తుంటారట దాంతోపాటు ఒక మంచి మెసేజ్ ను కూడా ఇస్తుంటారు.

Also read:పార్వతి మెల్టన్ ఇప్పుడు ఎక్కడ ఉంది?

పూజా హెగ్డే కి ఈ విధానం బాగా నచ్చడంతో ఆమె కూడా మంగళూరులో ఉన్న తన తోటలో కాసే పండ్లను మిత్రులు, సన్నిహితులకు పంపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. అలాగే ప్రిన్స్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశం ఉందనే సమాచారం వినబడుతోంది.

Also read:తప్పు నాది.. మా కుటుంబాన్ని ఎందుకు లాగింది? శ్రీరెడ్డిపై అభిరామ్ ఫైర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -