- Advertisement -
నందమూరి హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున రోడ్డు యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. అభిమాని ఇంట్లో పెళ్లికి వెళ్తుంటే ఆ దుర్ఘటన చోటు చేసుకుంది.ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి చెందింది. టాలీవుడ్కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హరికృష్ణకు నివాళులు అర్పిస్తున్నారు.
తాజాగా ఆయన మరణంపై ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఈ విషయంపై స్పందించారు.హరికృష్ణతో మంచి స్నేహ బంధం ఉందని,ఆయనతో కలిసి నేను కొన్ని సినిమాలు చేశానని తెలిపారు.”హరికృష్ణ మోసపోవడమే తప్ప.. ఎవరినీ మోసం చేయలేదు. ఎవరినీ నాశనం చేయాలనే ఉద్దేశం ఆయనకు లేదు. హరికృష్ణది స్వచ్ఛమైన మనస్సు అంటు చెప్పుకొచ్చారు పోసాని.