Friday, May 10, 2024
- Advertisement -

పూజా హెగ్డెకి షాక్ ఇచ్చిన ప్ర‌భాస్‌

- Advertisement -

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్‌కు బాహుబ‌లి సినిమా త‌రువాత ఇండియా మొత్తం క్రేజ్ ఏర్ప‌డింది. దీంతో అత‌ను న‌టిస్తున్న సినిమాల‌పై స‌ర్వ‌త్ర ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో మూవీని చేస్తున్నాడు. 200 కోట్ల‌కు పైగా బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ న‌టిస్తుంది. ఇక సినిమా త‌రువాత జిల్ సినిమా ద‌ర్శ‌కుడు రాధాకృష్ణతో క‌లిసి ప‌నిచేయ‌నున్నాడు ప్ర‌భాస్‌.

మొద‌ట ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేని తీసుకోవాలని దర్శకుడు రాధాకృష్ణ అనుకున్నారు. ప్రభాస్ తో ఆమె నటించడం ఖాయమని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ మాత్రం పూజాకి బదులుగా మరొక హీరోయిన్ ని చూడమని దర్శక నిర్మాతలకు సూచించినట్లు సమాచారం. హీరోయిన్ గా ఇప్పటివరకు ఆమె ఖాతాలో సరైన హిట్టు లేదు. ఈ కారణంగానే ప్రభాస్ తన సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా వ‌ద్ద‌నుకుంటున్నాడ‌ని స‌మాచారం. దీంతో చేసేది లేక మ‌రో హీరోయిన్ కోసం వెతుకున్నాడ‌టా చిత్ర ద‌ర్శ‌కుడు. పూజా హెగ్డే ప్ర‌స్తుతం, ఎన్టీఆర్ అర‌వింద స‌మేత ,మ‌హేశ్ బాబు మ‌హ‌ర్షి సినిమాల‌లో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -