Friday, April 26, 2024
- Advertisement -

ప్రియమణికి ఆ కోరిక ఉందట.. మరి అలా మెప్పిస్తుందా?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘యమదొంగ’ చిత్రంలో హీరోయిన్ గా అందరి మనసు దోచింది ప్రియమణి. తెలుగు లో ప్రియమణి ఎక్కువగా జగపతిబాబు తో నటించింది. ఇక తెలుగులో అవకాశాలు తగ్గుతూ ఉండటంతో, ఆమె ఎక్కువగా కన్నడ సినిమాలపై దృష్టిపెట్టింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. బాలీవుడ్, మాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటించింది.

ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రేక్షకులతో ఆమెకి కొంత గ్యాప్ వచ్చింది. అలాంటి ప్రియమణి ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో ఆమె ‘విరాటపర్వం’ సినిమాలోను .. ‘నారప్ప’ సినిమాలోను ముఖ్యమైన పాత్రలను పోషించింది. ఈ రెండు సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మద్య వెబ్ సీరీస్ లో కూడా ఈ అమ్మడు నటిస్తూ సందడి చేస్తుంది. అంతే కాదు తెలుగులో పలు రియాల్టీ షోల్లో జడ్జీగా వ్యవహరిస్తుంది.

తాజాగా ప్రియమణి మాట్లాడుతూ.. నేను చేసిన ‘విరాటపర్వం’, ‘నారప్ప’ పాత్రలు చాలా విభిన్నమైనవే. తెలుగులో నా కెరియర్ మంచిగానే సాగింది. ‘నరసింహ’ సినిమాలో రమ్యకృష్ణ చేసిన ‘నీలాంబరి’ తరహా పాత్రలో చేయాలనుంది. అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. పొగరు, పంతంతో కూడిన అలాంటి పాత్రలు నా బాడీ లాంగ్వేజ్ కి బాగా సెట్ అవుతాయి అని అన్నారు ప్రియమణి.

క్రేజీ ప్రాజెక్ట్స్ తో వరలక్ష్మీ శరత్ కుమార్ ఫుల్ బిజీ!

విశాఖలో పీవీ సింధు అకాడమీకి 2 ఎకరాల భూమి.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు

వీడు మనిషా.. రాక్షసుడా..? తల్లిని చంపి తర్వాత..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -