Friday, March 29, 2024
- Advertisement -

బాలీవుడ్ లో తెలుగోళ్లు.. ఎవరంటే?

- Advertisement -

సాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగువాళ్ళకి అవకాశాలు రావాలంటే ఎంతో సాహసంతో కూడుకున్న పని. అలాంటివి ఎలాంటి అనుభవం లేకుండా,ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఏకంగా బాలీవుడ్ లో అడుగు పెడితే రాణించగలమా అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఈ క్రమంలోనే తెలుగు వాళ్లుగా పుట్టి పెరిగి బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి సినిమాలు తీస్తున్న సమయంలో వెబ్ సిరీస్ ల భాట పట్టారు. ఈ విధంగా వెబ్ సిరీస్ లను తీసుకున్న సమయంలో ఎంతో మంది ఎన్నో రకాల మాటలతో వీరిని బయటపెట్టారు. అయితే అందరూ అన్న మాటలను పటాపంచలు చేస్తూ తమదైన శైలిలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నారు రాజ్‌ అండ్‌ డీకే.

ఇద్దరు చదువుకునే రోజుల్లో ఎంతో స్నేహితులుగా ఉన్న వీరు సినిమా పై ఉన్న మక్కువతో ఇద్దరిని సినిమా రంగం వైపు నడిపించింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే తమ కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం ఎంతో బిజి స్టార్లుగా మారిపోయారు. తాజాగా వీరిద్దరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ రెండో సీజన్‌ భారతీయులను విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Also read:బిగ్ బాస్ ఆఫర్ కొట్టేసిన.. ఆర్ఎక్స్ బామ!

ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే. చిత్తూరు జిల్లాకు చెందిన వాసులు. సినిమాపై ఉన్న మక్కువ ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తమదైన ముద్ర సంపాదించుకున్నారు. వీరిద్దరూ కలసి బాలీవుడ్ ఇండస్ట్రీలో 99 అనే సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించారు. ఇది విడుదల అయిన కొద్ది నెలలకే  ‘షోర్‌ ఇన్‌ ది సిటీ’ హక్కులను ఏక్తా కపూర్‌ తీసుకుంది.  అదీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత తొలి ఇండియన్‌ జాంబీ చిత్రం ‘గో గోవా గాన్‌’ తీశారు.  రూ.పది కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ. 40 కోట్ల సాధించింది .

Also read:అనిల్ రావిపూడి దర్శకత్వంలో యంగ్ హీరో.. ఎవరంటే?

ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగులో సత్తా చాటారు. తాజాగా ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా ఎంతో మంది తెలుగు నటులను బాలీవుడ్ కి పరిచయం చేసిన వీరు త్వరలోనే తెలుగులో సినిమా చేయాలనే ప్రయత్నం జరుపుతున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు విజయ్ దేవరకొండతో కథా చర్చలు జరుగుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -