దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా ‘మెహబూబా’ సినిమా చేశాడు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా చేసింది.సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని మే 11న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆకాష్ మాట్లాడుతు సినిమా బాగా వచ్చిందని సినిమా మంచి హిట్ అవుతుందని ధీమ వ్యక్తం చేశాడు.అక్కడ మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు హీరో ఆకాష్.
సినిమాకు నాకు రేమ్యూనిరేషన్ మా నాన్న(పూరి జగన్నాథ్)ఇవ్వలేదని , అసలు దాని గురించి నేను అడగలేదని కాని ఇస్తే మాత్ర తీసుకొవలని ఉందని సినిమా హిట్ అయితే లాభాల్లో వాటా ఇస్తారేమో చూడాలి సరాదాగా మాట్లాడాడు. పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. తన సొంత నిర్మాణ సంస్థలో పూరి ఈ సినిమాను నిర్వహిస్తున్నాడు. సహా నిర్మాతగా హీరోయిన్ ఛార్మి వ్యవహరిస్తుంది.