దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమా కథల రాయడానికి ఎక్కువుగా బ్యాంకాక్ వెళ్తాడని అందరికి తెలిసిందే.ఈ విషయాన్ని స్వయంగా పూరి కూడా చాలాసార్లు చెప్పారు.తాజా ఆయన తనయుడు ఆకాష్ తన తండ్రి బ్యాంకాక్ విషయంపై స్పందించాడు.ఇటీవల ఆకాశ్ పూరీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తండ్రి గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఆయన స్టోరీలు రాయడానికే బ్యాంకాక్ వెళ్తాడనే విషయం నిజమేనని తెలిపాడు.
ఇక్కడ ఉండే ఒత్తిళ్ల వల్ల ఆయన కథలపై దృష్టి పెట్టలేరని, అందుకే ఆయన బ్యాంకాక్ వెళ్లి కథలు సిద్ధం చేసి తిరిగి వస్తారని చెప్పాడు. బ్యాంకాక్ అంటే మసాజులు మాత్రమే కాదు.. అది చాలా మంచి ప్రాంతం. అక్కడ మంచి కుటుంబాలు కూడా నివసిస్తాయి’’ అని ఆకాశ్ తెలిపాడు. ఆకాశ్ తండ్రి పూరీ దర్శకత్వంలో ‘మెహబూబా’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన సంగతి తెలిసిందే. సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు,కాని నటుడిగా ఆకాష్కు మంచి పేరు వచ్చింది.