చిన్న సినిమాతో కెరీర్ ప్రారంభించి తొలుత కొంచెం టాప్కొచ్చి మళ్లీ కెరీర్ ప్రమాదంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటున్న హీరోయిన్ రాశీఖన్నా. గతంలో హీరోయిన్గా ఆ తర్వాత సెకండ్ హీరోయిన్గా ఇప్పుడు మళ్లీ స్టార్ హీరోయిన్గా రాశీఖన్నా ఎదుగుతోంది. ఇటీవల వరుణ్తేజ్ కలిసి నటించిన తొలిప్రేమ సినిమా హిట్తో రాశీకి సినిమా అవకాశాలు వరుస కడుతున్నాయి. ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాశీఖన్నా ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత సెకండ్ హీరోయిన్గా చేసింది.
ఇప్పుడు మళ్లీ హీరోయిన్గా రాణించడానికి తన నటనను మెరుగపరచుకుంటోంది. అయితే సినిమా జయాపజయాలు గురించి ఆ అమ్మడు మాట్లాడుతోంది. మీరెవరు నమ్ముతారో లేదో కానీ… సెట్లో దర్శకుడు చెప్పింది చేయడం తప్ప నాకు మరొకటి తెలియదు అంటూ చెబుతోంది. నమ్మకం లేకపోతే ఏ సినిమా చేయలేం. రోజూ వందశాతం నమ్మకంతోనే సెట్లోకి అడుగుపెడతాను. ఫలితాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. సినిమా ఏమవుతుందో ఏంటో అని ఆలోచిస్తూ పనిచేస్తుంటే నటనను ఆస్వాదించలేం.
ఇప్పుడనే కాదు, చిత్ర పరిశ్రమకి వచ్చిన కొత్తలోనూ నా పంథా ఇదే. అందుకే జయాపజయాలు నాపై ఏ దశలోనూ ప్రభావం చూపించలేదు. వరుస పరాజయాలు ఎదురైనా నిరుత్సాహపడలేదు. నా పనితీరే నన్ను నిలబెడుతుందనే నమ్మకం నాలో ఎప్పుడూ ఉంటుంది అని రాశీఖన్నా చెప్పుకొస్తోంది. వరుణ్తో ‘తొలిప్రేమ’ సినిమా కోసం కొంచెం బక్క చిక్కి క్యూట్ లుక్లో కనిపించింది. ప్రస్తుతం నితిన్తో కలిసి ‘శ్రీనివాస కల్యాణం’లో రాశీ నటిస్తుండగా మరికొన్ని సినిమాలతో బిజీగా ఉంది.