రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు ఈ హీరోయిన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. “కెరటం” అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ సినిమా పెద్ద విజయం సాధించకపోయిన సందీప్ కిషన్ హీరోగా వచ్చిన “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.
ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించడంతో రకుల్ వరస అవకశాలు వెతుకుంటూ వచ్చాయి. తక్కువ టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగడమే కాదు ఎందరో అభిమానులను సంపాధించుకుంది. వరస హిట్స్ సాధిస్తూ అటు గ్లామర్ తోనూ, ఇటు అభినయంతోనూ టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సంగతి ఎలా ఉంటే.. ఇటివలే ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపింది.
{loadmodule mod_custom,Side Ad 1}
యాంకర్ ఆమెను డేటింగ్ చేస్తే ఎవరితో చేస్తారు అని అడిగితే రకుల్ వెంటనే.. ఇంతవరకు ఎవరి ప్రేమలో పడలేదని.. నా అభిమాన హీరో రణవీర్ సింగ్ అని ఆయనతో కలిసి డేటింగ్ చేయాలనీ ఉందని చెప్తూ యాంకర్ ను ఆశ్చర్యపరిచింది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీ సినిమాలు కూడా చేస్తోంది. ఆ మధ్య “యారియన్” అనే సినిమాలో నటించిన రకుల్ ప్రస్తుతం రాజ్ కుమార్ రావు హీరోగా తెరకెక్కుతున్న “షిమ్లా మిర్చి” సినిమాలో నటిస్తోంది. ఈ మూవీకి దివ్య ఖోస్లా కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏది ఏమైనా త్వరలోనే రకుల్ తన అభిమాన హీరోతో కలిసి సినిమా చేయాలనీ.. అలానే డేటింగ్ చేయాలని ఆశపడుతోంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related