- Advertisement -
మెగాపవర్స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుందన్న సంగతి అందరికి తెలిసిందే. రామ్ చరణ్ సినిమా విశేషాలతో పాటు సమాజంలో జరిగే వాటిపై స్పందిస్తుంటుంది ఉపాసన. ప్రస్తుతం ఆమె యూపీలో జరుగుతున్న కుంభమేళకు వెళ్లినట్లుంది.
అక్కడ అఘోరాలతో దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ప్రస్తుతం అపోలో ఆస్పత్రి ఎండీగా వ్యవహారిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికి భక్తి శ్రద్ధలతో ఆమె పుణ్య క్షేత్రాలను దర్శించడంలో సాంప్రదాయ ఇల్లాలు అనిపించుకున్నారు. భర్త రామ్ చరణ్ లేకుండాఈ పుణ్య క్షేత్రాలను సందర్శిస్తుంది ఉపాసన.