‘కుచ్ కుచ్ హోతా హై’ నుంచీ మొన్నటి ‘బ్లాక్’ వరకూ రాణీ ముఖర్జీ చేసిన పాత్రలు కానీ ఇంకేదైనా ఆసక్తికర చిత్రం కానీ ప్రేక్షకులు చక్కగా ఆదరిస్తూ వచ్చారు.
బాలీవుడ్ లో బడా హీరోయిన్ గా చెలామణీ అయిన రాణీ తరవాత తన చిరకాల మిత్రుడు ఆదిత్య చోప్రా ని పెళ్లి చేసుకుని సంతోషంగా బతుకుతోంది. రాణీ ముఖర్జీ తరవాత కూడా నటన కొనసాగిస్తూ నిర్మాతగా మారింది. రాణీ ఈ మధ్యనే పిల్లల గురించి ఆలోచించడానికి సమయం దొరకట్లేదు అని చెప్పింది కానీ బేబీ బంప్తో ఫొటో కెమెరాలకు చిక్కేసింది.
ఇంటర్నెట్లో ఈ ఫొటో వైరల్గా మారింది. ఈ విషయం మీద మీడియా ఎంత బలవంత పెట్టినా ఆమె స్పందించక పోవడం గమనార్హం. ఆమె భర్త ఆదిత్య కూడా ఈ విషయం బయటకి చెప్పడానికి ఇష్ట పడట్లేదు. రాణీ మాత్రం తరచూ డాక్టర్ లని కలుస్తోంది అని వారి సూచనల మేర జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది అని విశ్వసనీయ వర్గాలు క్బెఉతున్నయి.
ప్రెగ్నెన్సీ లాంటిదేదన్నా ఉంటే ముందు మీడియాకే చెప్తామంటూ కొన్ని వారాల క్రితమే రాణి ముఖర్జీ, ఆమె భర్త సరదాగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇలోగా ఈ ఫోటో లు లీక్ అయ్యాయి