తెలుగు ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తుకు వస్తుంది రష్మిక మందన్నా. కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా తో ఒక్కసారిగా దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ చూపు మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న నటి రష్మిక. ఆ సినిమా అందించిన విజయం రష్మిక కి వేరే పరిశ్రమల్లో అడుగు పెట్టడానికి బాగా తోడ్పడింది. ముఖ్యం గా ఆ సినిమా ఇచ్చిన విజయం తో రష్మిక తెలుగు లో మొదటగా చలో అనే సినిమా తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
ఈ సినిమా తర్వాత వెంటనే గీత గోవిందం లో నటించి ఒక్కసారిగా స్టార్డం అందుకుంది. ఆ తర్వాత చేసిన దేవదాస్ సినిమా లో కూడా రష్మిక అందరి ప్రశంసలు అందుకుంది. కానీ రష్మిక తన పర్ఫార్మెన్స్ ని పూర్తి గా చూపించే అవకాశం మాత్రం డియర్ కామ్రేడ్ తో నే అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్లోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతుంది. హిందీలో ‘మిషన్ మజ్ను’ సినిమాతో పాటు అమితాబ్ బచ్చన్తో కలిసి గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే శర్వానంద్ హీరోగా రాబోతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే మూవీ చేస్తోంది. ఇలా బిజీ షెడ్యూల్ తో ఉన్న రష్మిక ఎయిర్ పోర్ట్లో క్లీవేజ్ సొగసులతో చేతిలో జాకెట్ పట్టుకొని.. మతిపోగెట్టే లుక్లో కెమెరాకు చిక్కింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read : విజయ్ దేవరకొండ లైనప్ మామూలుగా లేదు.. లైన్లో నలుగురు టాప్ డైరెక్టర్లు..!