Wednesday, May 15, 2024
- Advertisement -

సోషియ‌ల్ మీడియాలో వ‌ర్మ‌పై ప‌వ‌న్ అభిమానుల దాడి….

- Advertisement -

సినిమా ఇండ‌స్ట్రీలో వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ ఎవ‌రంటె ముందుగా చెప్పుకొనేది స్టార్ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ‌. నిత్యం ప్ర‌తి ఇష్యూమీద వ‌ర్మ‌ స్పందించిన ప్ర‌తీసారి వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. తాజాగా వ‌ర్మ ప‌వ‌ణ్‌పై మ‌రో సారి ట్విట్ట‌ర్‌లో సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంటె ఆర్జున్ రెడ్డి సినిమా హీరో దేవ‌ర‌కొండ ప‌ది రెట్లు మేల‌ని ట్విట్ట‌ర్‌లో పోష్ట్ పెట్టారు వ‌ర్మ . అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన చిన్న సినిమా ఎంత‌టి భారీ విజ‌యాన్ని న‌మోదు చేసిందో అంద‌రికి తెలిసిందే. బాహుబ‌ళి సినిమా త‌ర్వాత ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా అన్ని వ‌ర్గాల వారిని అక‌ట్టుకుంది. లోటు బ‌డ్జెట్‌తో వ‌చ్చిన ఈ సినిమాలో ఎలాంటి పంచ్ డైలాగ్‌లు లేకుండా హిట్ సాధించింద‌న్నారు. ఇప్ప‌టికి ఈసినిమా వ‌సూల్ల ప‌రంగా దూసుకెల్తోంది.

ప‌వ‌న్‌పై క‌త్తి మ‌హేష్ చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సంచ‌న‌లం సృష్టించాయో తెలిసిందే. దీనిపై అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. మ‌రి ఇప్పుడు ప‌న‌వ్‌పై వ‌ర్మ వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ అభిమానులు ధ్వ‌జ‌మెత్తారు. సోషియ‌ల్ మీడియాలో వ‌ర్మ‌పై తిట్ల‌దండ‌కం మొద‌లు పెట్టారు. క‌త్తిమ‌హేష్‌, వ‌ర్మ వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -