Sunday, May 5, 2024
- Advertisement -

బాహుబ‌లి రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన ‘2.ఓ’

- Advertisement -

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌,స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్త‌న్న సినిమా ‘2.ఓ’ వ‌చ్చే వారం ఈ సినిమా ధియోట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ‘2.ఓ’ విడుదలకు ముందే ‘బాహుబలి’ రికార్డును అధిగమించింది. ‘బాహుబలి’ రెండో భాగాన్ని ప్రపంచవ్యాప్తంగా 6,500 థియేటర్లలో విడుదల చేయగా, ‘2.ఓ’ 6,800 థియేటర్లలో విడుదల కానుంది. 3డీ టెక్నాలజీ, 4డీ సౌండ్ తో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త విందు అందించడం ఖాయమని నిర్మాతలు చెబుతున్నారు.

దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో తయారైన సినిమా విదేశాల్లో 4 వేల థియేటర్లలో విడుదల కానుందని, ఇండియాలో 2,800 థియేటర్లలో విడుదలవుతుందని తెలుస్తోంది.ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.హీరోయిన్‌గా అమీ జాక్సన్ న‌టిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -