క్రియేటివ్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ (రౌద్రం, రణం, రుధిరం) పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. సినిమా ప్రమోషన్లో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిలతో కూడిన చిత్ర బృందం దేశ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నది. సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం ఈ సినిమా విడుదలపై నిర్మాతలు పునరాలోచనలో పడ్డట్టు ఫిలిం నగర్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని వార్తలు వస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో కేసులు ఇప్పటికే వందల్లో నమోదవుతున్నాయి. చాలా రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి.
ఇటీవల తెలంగాణ హైకోర్టు సైతం పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలోనూ త్వరలో రాత్రి పూట కర్ప్యూ విధించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ సినిమా అయిన ఆర్ఆర్ఆర్ విడుదలపై సందేహాలు తలెత్తుతున్నాయి. కాగా సినిమా యూనిట్ మాత్రం జనవరి 7నే అనుకున్న ప్రకారం సినిమా విడుదల చేస్తామని స్పష్టం చేసింది.
సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!