Sunday, May 5, 2024
- Advertisement -

నేనా .. మ‌హేష్‌బాబుతోనా..

- Advertisement -

నేనా మ‌హేష్ ప‌క్క‌న ఎవ్వ‌రు చేప్పారని తిరిగి మీడియాను ప్ర‌శ్నించారు సాయిధరమ్ తేజ్.జ‌వాన్ మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో పోల్గోన్న సాయిధరమ్ తేజ్ మీడియా అడిగిన అడిగిన ప్ర‌శ్న‌ల‌కు పై విధాంగా స్పధించారు.ఈ మధ్య దిల్ రాజు ఫ్యామిలీ ఫంక్షన్ ఒకదానికి మహేష్ బాబు రావడం.. ఆ సందర్భంగా సాయిధరమ్‌ తేజ్‌తో మల్టీస్టారర్ చేయమంటూ దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్‌తో అనడం.. మంచి కథతో రమ్మని మహేష్ చెప్పడం.. దీని గురించి మీడియాలో వార్తలు రావడం తెలిసిందే. ముందు దీని గురించి సరదా వార్తలే వచ్చాయి కానీ.. కొందరు దీన్ని సీరియస్‌గా తీసుకుని వార్తలు అల్లేశారు.

మహేష్ బాబు-సాయిధరమ్ తేజ్ నిజంగానే కలిసి నటించబోతున్నట్లు ఊహాగానాలు సృష్టించారు. ఐతే ఇప్పుడు సాయిధరమ్ తేజ్ స్వయంగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తాను మహేష్ బాబుతో నటించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నాడు.అలాగే రామ్ చరణ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో రాజమౌళి తీయబోయే సినిమాలోనూ తాను ఓ పాత్ర చేయబోతున్నట్లు చెప్పుకుంటున్నారని.. అది కూడా అబద్ధమే అని తేజు చెప్పాడు.

తాను ఇప్పుడు చేస్తున్న, చేయబోయే సినిమాల గురించి తేజు ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ‘‘వి.వి.వినాయక్ గారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఈ సినిమా నా కెరీర్‌ను మలుపు తిప్పుతుందని అనుకుంటున్నా. ఆ సినిమా కొత్తగా ఉంటుంది. కరుణాకరన్ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేస్తున్నాను. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. కె.ఎస్.రామారావు నిర్మాత. గీతా ఆర్ట్స్‌లోనూ ఓ సినిమా ఉంటుంది. మైత్రీ మూవీస్ బేనర్లోనూ ఓ సినిమా చేస్తున్నా. నేను, వరుణ్ తేజ్ కలిసి ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. కథ దొరికితే ఆ సినిమా పట్టాలెక్కుతుంది’’ అని సాయిధరమ్ చెప్పాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -