ఇటీవల ప్రముఖ నటులంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. అంతేకాక అభిమానులతో కూడా లైవ్ చాట్ చేస్తున్నారు. రీసెంట్గా మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. తన ఫ్యాన్స్తో ఇన్స్టాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించాడు. లైవ్లోకి వచ్చిన ఆయన ఫ్యాన్స్ పలు ప్రశ్నలు సందించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ తనకు గురువులని.. వాళ్లే తనకు ప్రేరణ కలిగించారని సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. తాను నాగబాబు నుంచే నవ్వడం నేర్చుకున్నానని చెప్పాడు. ఇటీవల సెలబ్రిటీలంతా నిత్యం తమ అభిమానులతో అన్ని విషయాలు పంచుకుంటున్నారు. వాళ్లకు సోషల్ మీడియా మంచి వేదికగా మారింది.
ఇక ఫ్యాన్స్ కూడా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీడియాను ఆశ్రయించకుండా.. నేరుగా తమ అభిమాన నటులు, డైరెక్టర్ల సోషల్ మీడియా ఖాతాలను పంచుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో లైవ్ లు నిర్వహించడం.. అభిమానులతో నేరుగా ముచ్చటించడం కూడా కామన్ అయిపోయింది. అప్పుడప్పుడు కొందరు తింగరి నెటిజన్లు తిక్క తిక్క ప్రశ్నలు అడుగుతూ నటులను ఇబ్బంది పెడుతుంటారు. గతంలో ఓ నెటిజన్ పూజాహెగ్డేను న్యూడ్ పిక్ పంపించాలని కోరాడు. దీనికి ఆమె తన కాలును పిక్ తీసి పంపించింది. అంతా మెచ్చుకున్నారు.
Also Read: మరోసారి ఎన్టీఆర్ తో పూజా హెగ్డే రొమాన్స్ ..!
ఇదిలా ఉంటే తాజాగా సాయిధరమ్ తేజ్ను ఓ ఫ్యాన్.. ’ అన్నా నేను మీ ఫ్యాన్. మీ మొబైల్ నంబర్ ఇవ్వండి’ అంటూ అడిగాడు. దీనికి సాయిధరమ్ తేజ్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ‘నేను నీకు మొబైల్ నంబర్ ఇస్తే.. శివమణి చిత్రంలో ఎమ్ఎస్ నారాయణ లా అయిపోతుంది నా పరిస్థితి అన్నట్టుగా ఆ సినిమాలోని పిక్స్ పంపించాడు. ఇక సాయిధరమ్ తేజ్ సమయస్ఫూర్తికి చమత్కారానికి అంతా మెచ్చుకుంటున్నారు.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రాధే శ్యామ్ తాజా అప్డేట్ ఏమిటంటే ..!