- Advertisement -
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఓ చారిత్రత్మాక కథలో నటిస్తున్నాడా? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. దర్శుకుడు వీరు పోట్ల కృష్ణదేవరాయల కాలంనాటి ఒక కథను సిద్ధం చేస్తున్నాడని సమాచారం. కథ పూర్తి కావడంతో స్టోరీని సాయిధరమ్ తేజ్ కి వినిపించాడట దర్శుకుడు వీరు పోట్ల. కథ,కథనాలు విభిన్నంగా ఉండటంతో, వెంటనే సాయిధరమ్ తేజ్ ఓకే చెప్పేశాడట.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ‘తేజ్ ఐ లవ్ యూ’ రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాడు. మరి ఈ సినిమా అయిన తేజుకి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.
