చిరంజీవి మేనల్లుడు,అల్లుడు ఇద్దరు కలిసి ఒకేరోజు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వద్దమని డిసైడ్ అయ్యారు. ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు హీరోలు వస్తే ఒక హీరోకి అన్యాయం జరుగుతుందని,ఫ్యాన్స్కు తప్పుడు సంకేతాలు వెళ్తాయాని భావించిన మెగస్టార్ చిరంజీవి ఈ విషయంలో చొరవ తీసుకుని చిత్ర నిర్మాతలతో మాట్లాడి మెగా అల్లుడు సినిమాను ఒక వారం వాయిదా వేయించగలిగారు. అయిన ఈ అవకాశాన్ని వినియోగించుకోలేక పోయాడు సాయి ధరమ్ తేజ్. ఆయన నటించిన తేజ్ ఐ ల వ్య్వూ సినిమా నిన్న(శుక్రవారం) విడుదలై ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది.
గత కొంతకాలంగా సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్న తేజుకి ఈ సినిమా అయిన హిట్ ఇస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు. కాని ఈ సినిమా రోటిన్గా ఉందని తేజ్ ఐ ల వ్య్వూని ప్రేక్షకులు తిరస్కరించారు. మేనల్లుడు సినిమా ఫ్లాప్ కావడంతో ఇక మిగిలింది అల్లుడే. చిరంజీవి రెండో అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచియవుతున్న సినిమా విజేత. సినిమా ఆడియో ఫంక్షన్కు ముఖ్య అతిథిగా చిరంజీవి వచ్చిన, ఎందుకనో ఈ సినిమాకు అనుకన్నంత బజ్ రావడం లేదు.మేనల్లుడు సినిమా ఫెయిల్ అవ్వడంతో ,అల్లుడు సినిమా అయిన హిట్ కొట్టలని చిరంజీవి కోరుకుంటున్నాడు. మరి కల్యాణ్ దేవ్ అయిన హిట్ కొడతాడో లేక మేనల్లుడిలా ఫెయిల్ అవుతాడో చూడాలి అంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.