Sunday, May 19, 2024
- Advertisement -

సాయి ప‌ల్ల‌వి చెల్లెలు కూడా రంగంలోకి దూకుతోందా…?

- Advertisement -

మ‌ళ‌యాళ ప్రేమ‌మ్ సినిమాతో హీరోయిన్‌గా గ్రాంగ్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే హిట్ స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది సాయి ప‌ల్ల‌వి. తెలుగులో ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను కూడా ఫిదా చేసింది. ఇటీవ‌లే త‌మిళంలో రౌడీ బేబితో ర‌చ్చ చేసింది ఈ భామ‌. తెలుగు,త‌మిళ‌, మాళ‌యాళ భాష‌ల‌లో వ‌రుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు త‌న చెల్లెలు పూజాను రంగంలోకి దించ‌డానికి రెడీ అవుంద‌ని మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. సాయి ప‌ల్ల‌వి త‌న చెల్లెల‌ను హీరోయిన్‌గా ప‌రిచియం చేయించాల‌ని తెగ ఆరాట‌ప‌డుతుంద‌ట‌.

స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇప్పిస్తే, ఈజీగా ప్రేక్ష‌కుల‌కు రిజస్టార్ అవుతుంద‌నే ఆలోచ‌న‌లో ఉంద‌ట సాయిప‌ల్ల‌వి. దీనికి త‌గిన‌ట్లుగానే పూజా హీరో ధ‌నుష్‌తో దిగిన ఫోటో సోష‌ల్ మీడియాలో భాగా వైర‌ల్ కావ‌డంతో పూజా ధ‌నుష్‌తో సినిమా చేయ‌డానికి రెడీ అవుతుంద‌ని కోలీవుడ్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఈ వార్త‌ల‌పై సాయి ప‌ల్ల‌వి స్పందించింది. పూజా ప్రస్తుతం ఎంబీబీఎస్‌ చేస్తోందని, తన దృష్టంతా చదువుపైనే ఉందని, సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందనే వార్తల్లో నిజం లేదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -