బాలీవుడ్ లో సల్మాన్ఖాన్ కు ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన సినిమా రిలీజ్ అయితే.. ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురుస్తుంది. ఆయన మార్కెట్ వందల కోట్లు ఉంటుంది. దక్షిణాదిన కూడా సల్లూభాయ్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సల్మాన్ ఖాన్ గత చిత్రం ‘రాధే’ ఓటీటీలో విడుదల చేయగా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా చూసిన సల్మాన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. దర్శకుడు ప్రభుదేవాను తిట్టిపోశారు. ఇక రివ్యూలు కూడా చాలా దారుణంగా వచ్చాయి.
ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తోంది. ప్రేక్షకుల అభిరుచులు సైతం మారాయి. ఈ క్రమంలో పెద్ద హీరోలు సైతం విభిన్న కథాంశాలను కోరుకుంటున్నారు. రొటీన్ కథ, ఫైట్లు, పాటలు, స్పెషల్ సాంగ్స్, భారీ క్లైమాక్స్ ఇటువంటి ఫార్ములాకు కాలం చెల్లింది. అయితే రాధే మాత్రం పాత ఫార్ములాలో ఉండటంతో ప్రేక్షకులకు చిర్రెత్తుకొచ్చింది. రాధే సినిమాను ఓటీటీలో విడుల చేశారు. టికెట్ ధర రూ.249 పెట్టారు. దీంతో బాగానే మార్కెట్ అయ్యింది. అయితే థియేటర్లకు పర్మిషన్ రాగానే విడుదల చేస్తామని మేకర్లు ఇది వరకే ప్రకటించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో లాక్డౌన్ నిబంధనలు సడలించిన విషయం తెలిసిందే. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు పునః ప్రారంభం అయ్యాయి.
Also Read: మెగాస్టార్ వర్సెస్ రెబల్ స్టార్..!
సల్మాన్ ఖాన్ సినిమా కావడంతో జనం బాగానే వస్తారని సినిమాను విడుదల చేశారు. కానీ మొదటి రోజు కేవలం 84 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాట. మొత్తం రూ. 6000 మాత్రమే ఆదాయం వచ్చిందట. దీంతో మేకర్స్ షాక్ అయ్యారు. ప్రస్తుతం లాక్ డౌన్ తో జనాలు పెద్దగా థియేటర్ల వైపుకు వెళ్లడం లేదు.. అయినప్పటికీ ఓ స్టార్ హీరో సినిమాకు కేవలం 84 టికెట్లు తెగడం ఏమిటని అంతా ఆశ్చరపోతున్నారట. ఓటీటీ విడుదల అనంతరం వచ్చిన టాక్ వల్లే.. ఈ పరిస్థితి వచ్చిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: సీతగా ఆమెనా.. అస్సలు ఒప్పుకోం..!