Friday, May 3, 2024
- Advertisement -

ఆ కారణంగా ట్రోలింగ్ కి గురైన సమంత?

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న అక్కినేని సమంత ఓవైపు సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా మరో వైపు వెబ్ సిరీస్ లో చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. నటిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సమంత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానుల సందడి చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించిన సమంత ప్రస్తుతం పెద్దఎత్తున ట్రోలింగ్ కి గురయ్యారు.

అక్కినేని సమంత, మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే ట్రైలర్ చూసిన తమిళులు పెద్ద ఎత్తున సమంతను ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ఈ ట్రైలర్ లో తమిళనాడు ప్రజలను ఉగ్రవాదులుగా చూపించారు అంటూ పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే సమంతను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Also read:కరోనా బాధితుల కోసం ముందుకొచ్చిన యాంకర్ వింధ్య.. ఎలా అంటే?

ఈ క్రమంలోనే సమంత నటించిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” స్ట్రీమింగ్ ఆపాలని, చిత్రయూనిట్ తమకు క్షమాపణ చెప్పాలని తమిళ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత గుణశేఖర్ దర్శకత్వంలో “శాకుంతలం”అనే పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణం వల్ల షూటింగ్ వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సద్దు మణిగాక ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.

Also read:ఆ స్టార్ హ్యాండ్ ఇవ్వడంతో అ!2 ఆగిపోయిందంటున్న డైరెక్టర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -